మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలో జాతీయ రహదారి-44పై జరుగుతున్న ఫ్లైఓవర్ పనుల వల్ల సర్వీస్ రోడ్డు ఇరుకుగా మారింది. శుక్రవారం రాత్రి భారీ సరుకుతో వెళ్తున్న డీసీఎం వాహనం మధ్యలో ఆగిపోవడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీనివల్ల వాహనాలు నెమ్మదిగా కదిలి, హైదరాబాద్ వెళ్లాలనుకున్న ప్రయాణికులు ఆలస్యంతో ఇబ్బందులు పడ్డారు.