మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పరిధిలోని పోక్సో కేసులో ప్రధాన నిందితుడికి జీవిత ఖైదు, మిగిలిన ఇద్దరు నిందితులకు కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధిస్తూ సోమవారం మహబూబ్ నగర్ పోక్సో ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. బాధితురాలికి రూ. 5 లక్షల పరిహారం మంజూరు చేయబడింది. బలమైన సాక్ష్యాధారాలతో నిందితులకు శిక్ష పడేలా చేసిన అధికారులను జిల్లా ఎస్పీ అభినందించారు.