మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ప్రయాణిస్తున్న కారు సోమవారం బాలానగర్ మండల కేంద్రం సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో అదనపు కలెక్టర్, ఆర్డీఓ నవీన్ తోపాటు కారులో ఉన్న ఇతరులకు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదంలో కారు ముందు భాగం ధ్వంసం అయింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.