ఊట్కూరు మండలంలో బుధవారం 108 అంబులెన్స్లో ఒక మహిళ శిశువుకు జన్మనిచ్చింది. పులి మామిడి గ్రామానికి చెందిన కుర్మక్క పురిటి నొప్పులతో బాధపడుతుండగా, మార్గమధ్యంలో అంబులెన్స్లోనే ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా 108 అంబులెన్స్ సిబ్బందికి బంధువులు కృతజ్ఞతలు తెలిపారు. అత్యవసర సమయాల్లో 108 అంబులెన్స్ సేవలను వినియోగించుకోవాలని డిస్టిక్ మేనేజర్ సునీల్ కుమార్ సూచించారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని సమాచారం.