నారాయణపేట జిల్లా మక్తల్ మండలం చిట్యాల-గజరందొడ్డి గ్రామాల మధ్య 20 కోట్లతో నిర్మిస్తున్న బ్రిడ్జి కమ్ బ్యారేజ్ నిర్మాణ పనులను గురువారం మంత్రి వాకిటి శ్రీహరి పరిశీలించారు. పనుల నాణ్యతను తనిఖీ చేసి, అధికారులకు సూచనలు చేశారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి, బ్రిడ్జిని త్వరగా అందుబాటులోకి తేవాలని మంత్రి ఆదేశించారు.