నారాయణపేట: జాతీయ రహదారిపైకి వరద నీరు... వాహనదారులు ఇబ్బందులు

1461చూసినవారు
నారాయణపేట జిల్లా మరికల్ లోని పెద్ద చెరువు నిండుకుండలా మారడంతో, అలుగు నుంచి వచ్చిన వరదనీరు నేరుగా 167వ జాతీయ రహదారిపైకి చేరుతోంది. చెరువు కింద కాలువలు కబ్జాకు గురికావడంతో నీరు మళ్లించడానికి మార్గం లేక రోడ్డుపైకి పెద్దఎత్తున చేరుతోంది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించి, కబ్జాలకు గురైన కాలువలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్