ఈనెల 19న నారాయణపేట జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ భవన్ లో జరిగే ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్) జిల్లా జనరల్ కౌన్సిల్ ను విజయవంతం చేయాలని పీవైఎల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఈశ్వర్ ప్రతాప్ పేర్కొన్నారు. శనివారం భగత్ సింగ్ భవన్ నారాయణపేట జిల్లా కార్యాలయంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు సిద్ధూ సలీం రాము శ్రీకాంత్ మల్లేష్ పెద్దింటిమధు శివ తదితరులు పాల్గొన్నారు.