కేంద్ర విధానాలు, సీసీఐ నిబంధనలపై రైతు నేత ఆగ్రహం

766చూసినవారు
కేంద్ర విధానాలు, సీసీఐ నిబంధనలపై రైతు నేత ఆగ్రహం
అకాల వర్షాలతో నష్టపోయిన పత్తి రైతులకు కేంద్ర ప్రభుత్వ విధానాలు, సీసీఐ కఠిన నిబంధనలు ఇబ్బందులు కలిగిస్తున్నాయని వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బండి వేణుగోపాల్ మంగళవారం తీవ్రంగా మండిపడ్డారు. ఎకరానికి 7 క్వింటాల పరిమితి, తేమశాతం 8-12% పెట్టడం, వర్షాలతో తేమ పెరగడంతో సీసీఐ కేంద్రాల్లో పత్తిని అమ్ముకునే పరిస్థితి లేదని, కనీస మద్దతు ధర కూడా దక్కడం లేదని ఆయన ఆరోపించారు. దీనివల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకునే దౌర్భాగ్యం దాపురించిందని విమర్శించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్