నారాయణపేట జిల్లా, మక్తల్ నియోజకవర్గం, ఉట్కూరు మండలం కొత్తపల్లి గ్రామంలో ఆదివారం నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ వేడుకలు జరిగాయి. రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు, లబ్ధిదారులకు మండల అధ్యక్షుడు సూర్య ప్రకాశ్ రెడ్డి, యూత్
కాంగ్రెస్ మహేష్ కుమార్, గ్రామ అధ్యక్షుడు ఆర్ నరసింహ, రామాంజనేయులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చాపల అరుణ, చాపలి రాజు కూడా పాల్గొన్నారు.