వనపర్తి జిల్లా, ఆత్మకూరు తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఎమ్మార్వో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, ఆధునికీకరణ ప్రక్రియలో బీఎల్దలకు సహకరించాలని ఆయన కోరారు. కొందరు ఓటర్ల చిరునామాలు ఇతర ప్రాంతాల్లో ఉన్నట్లు బీఎల్డీలు గుర్తించారని, వారి సరైన వివరాలను తెలియజేయడంలో కాలనీవాసులు భాగస్వాములు కావాలని సూచించారు.