వనపర్తిలోని ప్రభుత్వ ఎస్సీ కళాశాల బాలుర వసతి గృహం (బి)లో అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని, వసతి గృహ సంక్షేమ అధికారి పసుల సత్యనారాయణ యాదవ్ విద్యార్థులతో కలిసి జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన అమరవీరుల త్యాగాలను వివరిస్తూ, మహాత్మా గాంధీ ప్రపంచానికి అందించిన అహింసా సిద్ధాంతం, సత్యాగ్రహం వంటి మహత్తర ఆలోచనలు నేటికీ మార్గదర్శకాలని తెలిపారు. విద్యార్థులు ఈ విలువలను ఆచరిస్తూ మహనీయుల స్ఫూర్తితో విజయాలు సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గోపాల్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.