భారత్‌కు నేపాల్ ఎయిర్‌లైన్స్‌ క్షమాపణలు

22చూసినవారు
భారత్‌కు నేపాల్ ఎయిర్‌లైన్స్‌ క్షమాపణలు
నేపాల్ ఎయిర్‌లైన్స్ తన నెట్‌వర్క్ మ్యాప్‌లో జమ్మూకశ్మీర్‌ను పాకిస్థాన్‌లో భాగంగా చూపించడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ చర్య రెచ్చగొట్టేదిగా ఉందని భోజ్‌పురి నటుడు, గాయకుడు ఖేసరిలాల్ యాదవ్ ట్వీట్ చేశారు. నెటిజన్లు భారత విదేశాంగ శాఖ, విమానయాన మంత్రిత్వ శాఖలను నేపాల్‌పై దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. వివాదం నేపథ్యంలో, నేపాల్ ఎయిర్‌లైన్స్ తన పోస్టును తొలగించి, అంతర్జాతీయ సరిహద్దుల విషయంలో తప్పులు జరిగాయని అంగీకరిస్తూ భారత్‌కు క్షమాపణలు చెప్పింది.

సంబంధిత పోస్ట్