నేపాల్ హోంమంత్రి రమేశ్ లేఖక్ తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం సాయంత్రం నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి అధికారిక నివాసంలో జరిగిన అత్యవసర భేటీలో తన రాజీనామా లేఖను ప్రధానికి అందజేశారు. సామాజిక మాధ్యమాలపై విధించిన నిషేధించాన్ని వ్యతిరేకిస్తూ నేపాల్ యువత ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆందోళనలు కాస్తా హింసాత్మకంగా మారి 19 మంది మృతి చెందారు.