ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, గాజా భూభాగంలో 70 శాతానికి పైగా స్వాధీనం చేసుకోవాలని సైన్యాన్ని ఆదేశించినట్లు తెలిపారు. ఆక్రమిత వెస్ట్బ్యాంక్లో మాట్లాడుతూ, హమాస్పై ఇజ్రాయెల్ పట్టు బిగిస్తోందని, ప్రస్తుతం గాజాలో 60 శాతం భూభాగం తమ ఆధీనంలో ఉందని, దశలవారీగా 70 శాతానికి చేరుకోవాలని సైన్యానికి ఆదేశాలు జారీ చేశానని వెల్లడించారు. గత అక్టోబర్లో కాల్పుల విరమణ సమయంలో 53% భూభాగం ఐడీఎఫ్ నియంత్రణలో ఉండగా, ఈ ఏడాది ఏప్రిల్లో అది 64%కి పెరిగింది.