
తుఫాన్ ఎఫెక్ట్.. ఆయా పోర్టులకు ప్రమాద హెచ్చరికలు జారీ
AP: మొంథా తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఈ క్రమంలోని రాష్ట్రంలోని పలు పోర్టులకు వాతావరణ కేంద్రం ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. కాకినాడ పోర్టుకు 10, విశాఖపట్నం, గంగవరం పోర్టులకు 9, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు 8వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.




