
నకిలీ మద్యం కేసులో ఇరికించాలని కుట్ర చేస్తున్నారు: జోగి రమేశ్
AP: నకిలీ మద్యం కేసులో కుట్ర జరుగుతోందని ఆరోపించిన వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ ఈ దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. నిందితుడు ఏ-1 జనార్దన్ చేసిన ఆరోపణలపై ఆయన స్పందిస్తూ, “ఎవరినో ఒకరిని ఇరికించాలనే కుట్ర జరుగుతోంది. సిట్ చంద్రబాబు ఆదేశాల ప్రకారం పనిచేస్తోంది" అని విమర్శించారు. నిజమైన దోషులు బయటపడాలంటే కేసును సీబీఐ విచారణకు ఇవ్వాలని అన్నారు.




