వచ్చే సంవత్సరం నుంచి నీట్-యూజీ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఈ ఏడాది మే 3న జరిగిన నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపడంతో, ఆ పరీక్షను రద్దు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఎన్టీఏ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.