వాంకిడి మండలం గణేష్పూర్ గ్రామ సమీపంలో బుధవారం 363వ జాతీయ రహదారిపై కారు టైరు పగిలి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు పెద్దలకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే, ఇద్దరు చిన్నారులు క్షేమంగా బయటపడ్డారు. ఆసిఫాబాద్ నుంచి మహారాష్ట్ర వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రాణాపాయం తప్పడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.