ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ గ్రామంలో గల జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో శనివారం ఆస్ట్రోనామీ ల్యాబ్ ను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ తో కలిసి ప్రారంభించారు. ప్రభుత్వ బడుల్లోనే విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని, మస్కాపూర్ జెడ్పిహెచ్ఎస్ పాఠశాల పరీక్ష ఫలితాలతో పాటు అన్ని రంగాలలో ముందుండటం సంతోషకరమని కలెక్టర్ అన్నారు.