నిర్మల్ జిల్లా బాసర క్షేత్రాన్ని జిల్లా ఎస్పీ జానకి షర్మిళ ఈరోజు సాయంత్రం సందర్శించారు. బాసర గోదావరి నది వద్ద వరద ఉధృతిని, స్నాన ఘట్టాలపై పరిస్థితిని ఏఎస్పీ అవినాష్ కుమార్, ముధోల్ సిఐ మల్లేష్, బాసర ఎస్సై శ్రీనివాస్, ముధోల్ ఎస్ఐ బిట్ల పెర్సిస్ తో కలిసి సమీక్షించారు. గోదావరి నది వదల ఉధృతి ఉందని, భక్తులెవరు ఆందోళన చెందవద్దని, రేపు మూలనక్షత్రం సందర్భంగా భక్తులు ఆనందంగా దర్శనం చేసుకుని వెళ్ళొచ్చని జిల్లా ఎస్పీ జానకి షర్మిళ సూచించారు.