నేరడిగొండ మండలం బుద్ధికొండ గ్రామానికి చెందిన లింగంపల్లి లక్ష్మణ్ అనే యువకుడు మంగళవారం అర్ధరాత్రి రోల్ మామడ సమీపంలోని టోల్ ప్లాజా వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో మృతి చెందారు. హోలీ పండుగకు స్వగ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. లక్ష్మణ్ నిర్మల్ జిల్లాలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కాంపౌండర్గా పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు.