జాతీయ రహదారుల భద్రత మాసోత్సవాల్లో భాగంగా, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. రహదారి ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ రూల్స్, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ ఆవశ్యకత, ట్రిపుల్ రైడింగ్ వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించారు. విద్యార్థులు రహదారులపై జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు.