ప్రకృతి వ్యవసాయానికి భూచన్నకు రైతు రత్న అవార్డు
కన్హ శాంతి వనం నందిగామ రంగారెడ్డి జిల్లాలో జరిగిన మహా కిసాన్ మేళా సందర్భంగా, తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదర్శంగా సాగు చేస్తున్న రైతులకు తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం 'రైతు రత్న' అవార్డును అందజేసింది. నిర్మల్ జిల్లా తల్వేద గ్రామానికి చెందిన కోమటి భూచన్నకు, ప్రకృతి వ్యవసాయం మరియు దేశీయ వరి వంగడాలను భద్రపరచడం, విస్తరించడం వంటి కృషికి గాను, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ఈ అవార్డును ఇచ్చి సత్కరించారు.