రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో బుధవారం పర్యటించనున్న నేపథ్యంలో, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం నిర్మల్ జిల్లాకు చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గం ఇంచార్జ్ కూచాడి శ్రీహరి రావు నివాసంలో తేనేటి విందుకు హాజరైన మంత్రి, స్థానిక సంస్థల ఎన్నికలపై శ్రీహరిరావుతో చర్చించారు. కాంగ్రెస్ నాయకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు.