గత ఏడాది జులైలో ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకు నిర్మల్ పోలీసులు అరెస్టు చేసిన డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్కు ఊరట లభించింది. అతని పాస్పోర్ట్ను తిరిగి అప్పగించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. మంగళవారం నిర్మల్ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి నుండి దిలీప్ తన పాస్పోర్ట్ను తిరిగి తీసుకున్నారు. గతంలో పలుమార్లు పోలీసులకు, డీజీపీకి లేఖలు రాసినా ఫలితం లేకపోవడంతో దిలీప్ హైకోర్టును ఆశ్రయించారు.