పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో సోమవారం "ఫీజు పోరుబాట" పేరుతో పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. సుమారు రూ. 8 వేల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని విడుదల చేయకపోవడంతో విద్యార్థులను విద్యా సంస్థలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయని బీఆర్ఎస్వీ నాయకులు తెలిపారు. వెంటనే పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.