నిర్మల్ జిల్లా కేంద్రంలోని వార్డు నెంబర్ 9 బాగులవాడకు చెందిన మాజీ కౌన్సిలర్ అయ్యన్నగారి రాజేందర్ బుధవారం బీజేపీ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ తెలంగాణ భవన్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో నిర్మల్ బల్దియాపై బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.