లక్ష్మణచాంద మండలం పీచర గ్రామ మాజీ ఎంపీటీసీ బుర్రి భూమన్న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి, శనివారం నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు చూసి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రజలకు న్యాయం చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.