బాధితులకు భరోసా కల్పించేందుకు ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. నిర్మల్ జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించి, సమస్యలను పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను ఆమె ఆదేశించారు. ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేయడం, ప్రజా సమస్యలను పరిష్కరించడం తమ లక్ష్యమని ఎస్పీ పేర్కొన్నారు.