హైకోర్టు జడ్జి, మీడియేషన్ కమిటీ చైర్మన్ జస్టిస్ కె. లక్ష్మణ్ ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. జిల్లా అధికారులు, న్యాయవాదులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్థానిక అటవీ శాఖ వసతి గృహంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, నిర్మల్ ఏఎస్సీ రాజేష్ మీనా, ఆర్డీఓ రత్న కళ్యాణి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి ఆయనకు పుష్పగుచ్చం అందజేశారు. జస్టిస్ కె. లక్ష్మణ్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.