భూభారతి గ్రామ రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. బుధవారం దిలావర్పూర్ మండలంలోని సాంగ్వి గ్రామంలో నిర్వహించిన భూభారతి గ్రామ రెవెన్యూ సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి భూ సమస్యలు తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు.