నిర్మల్ పట్టణానికి చెందిన అంబేకర్ వర ప్రసాద్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో
కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అసత్య, విద్వేషపూరిత పోస్టులు చేస్తున్నాడని ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో, నిందితుడు వివిధ రాజకీయ వర్గాల మధ్య విద్వేషాలు, ప్రజల్లో అపోహలు సృష్టించేలా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసినట్లు గుర్తించారు. దీంతో అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ వెల్లడించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తిపై ఆందోళనలను పెంచుతోంది.