మామడ మండలం పొన్కల్ గ్రామానికి చెందిన శారద అనే మహిళ అనారోగ్యంతో హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించేందుకు, బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మంగళవారం ఆమె కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షల సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీ చెక్కును అందజేశారు. ఈ సహాయానికి లబ్ధిదారు కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.