నిర్మల్ పట్టణంలోని శాస్త్రినగర్ కాలనీకి చెందిన బెజ్జారపు శేషగిరిరాజు అనారోగ్యంతో హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎల్ఓసీ చెక్కును బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మంగళవారం కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎమ్మెల్యేకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.