జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, కారుణ్య నియామకాలు పొందిన 18 మంది ఉద్యోగులకు సోమవారం సాయంత్రం కలెక్టరేట్లో నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఉద్యోగులందరూ క్రమశిక్షణతో తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. గత మూడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలను పూర్తి చేసినట్లు తెలిపారు.