నిర్మల్: అధునాతనమైన సౌకర్యాలతో జిల్లా పోలీసుల సేవలు
నిర్మల్ జిల్లా పోలిసీంగ్ వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించడం లక్ష్యంగా ముందుకెళ్తున్నామని ఎస్పీ జి. జానకి షర్మిల పేర్కొన్నారు. నిర్మల్ జిల్లాలో నడుస్తున్న 100 వాహనాలకు నూతన జిపిఎస్ పరికరాలను సోమవారం అమర్చారు. ఆధునిక టెక్నాలజీ సహాయంతో అత్యవసర పరిస్థితులలో ఘటన స్థలానికి పోలీసులు వేగంగా గలుగుతారని చెప్పారు. దీంతో ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందుతాయన్నారు.