సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లాలో దొంగతనాలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. పండుగ సమయంలో ప్రజలు తమ స్వగ్రామాలకు వెళ్లే సమయంలో ఖాళీగా ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు జరిగే అవకాశం ఉందని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంట్లో ఉన్న నగదు, బంగారం, విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.