పెట్రోల్, డీజిల్ సరఫరాలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి నిర్వహించిన సమావేశంలో, పెట్రోల్ బంకుల వివరాలు, అమ్మకాలపై ఆరా తీశారు. ప్రతిరోజూ స్టాక్, అమ్మకాలు, మిగిలిన వివరాలను రిజిస్టర్ లో నమోదు చేయాలని, అవసరానికి మించి ఎవరికీ పెట్రోల్, డీజిల్ ఇవ్వరాదని సూచించారు.