చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

సారంగాపూర్ మండలంలోని ఆలూర్ గ్రామానికి చెందిన దేశెట్టి సాయన్న (51) అనారోగ్యం, భార్య మరణంతో ఒంటరితనం అనుభవిస్తూ పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గత నెల 27న పురుగుమందు తాగిన ఆయన, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. ఈ ఘటనపై మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
