నిర్మల్ జిల్లా కేంద్రంలోని గోల్డెన్ ఫంక్షన్ హాల్ ఏరియాలో నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో, శుక్రవారం (నిన్న) విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. శనివారం ఉదయం 8.30 గంటల నుండి 11.30 గంటల వరకు గోల్డెన్ ఫంక్షన్ హాల్, మౌలానా ఆజాద్ నగర్, టోనీ టవర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఏడీఈ శ్రీనివాస్ రావు తెలిపారు. ఈ అంతరాయం వల్ల ప్రభావితమయ్యే కాలనీల వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.