జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ల్యాండ్ ఆక్విజిషన్ నాయక్వాడి జల కుమారి అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించిన ఆమె, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో భాగ్యలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.