కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ దేవరకోట లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం పల్లకి సేవ వైభవంగా జరిగింది. స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఉంచి మాడవీధుల్లో ఊరేగించారు. ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మారుమోగింది. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారి నవీన్ భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.