దిలావర్పూర్ మండలం బన్సపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలను శనివారం సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న, విద్యార్థులు కష్టపడి చదవాలని సూచించారు. విద్యార్థుల అభ్యసన ప్రగతిని పరీక్షించి, ప్రాథమిక పాఠశాలలో తొలిమెట్టు, మూడవ తరగతికి నిర్వహించనున్న ఎఫ్ఎల్ఎస్ గురించి సమీక్షించారు. ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు చక్కటి ప్రణాళికతో అభ్యాసం చేసి పరీక్షలకు సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.