జిల్లాలో పంట ధాన్యాల కొనుగోలు ప్రక్రియ ప్రారంభం

0చూసినవారు
జిల్లాలో పంట ధాన్యాల కొనుగోలు ప్రక్రియ ప్రారంభం
జిల్లాలో పంట ధాన్యాల కొనుగోలు ప్రక్రియను ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 317 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, 10 సోయాబీన్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. మొక్కజొన్న కేంద్రాలను ప్రారంభించడంతోపాటు, ఇప్పటివరకు 29,100 క్వింటాళ్ల మొక్కజొన్న పంటను రైతుల నుంచి కొనుగోలు చేశామని పేర్కొన్నారు. రైతులు తమ పంటను ప్రైవేటు వ్యక్తులకు విక్రయించుకుని నష్టపోవద్దని కలెక్టర్ కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్