నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో సోమవారం 2008-2009 పూర్వ
విద్యార్థులు 17 సంవత్సరాల తర్వాత ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా తమ గురువులను ఘనంగా సన్మానించారు.
విద్యార్థులు ఆటపాటలతో ఆనందంగా గడిపారు. మళ్లీ ఎప్పుడు కలుస్తామో తెలియదని, ఇలాంటి గురువులు మళ్ళీ దొరకరు అని
విద్యార్థులు పేర్కొన్నారు. ఆనాటి ఆటపాటలు, జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.