నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో బంగారం వ్యాపారం చేస్తున్న రాళ్ళ శ్రీనివాస్, ఆయన కుమారుడు విష్ణు, వ్యాపారుల నుండి సుమారు నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేసి పరారయ్యారు. GST కారణంగా బంగారం వ్యాపారంలో లాభాలు తగ్గడంతో, GST లేకుండా బంగారం ఇప్పిస్తామని నమ్మించి ఈ మోసానికి పాల్పడినట్లు బాధితులు తెలిపారు. ఆర్మూర్ లో సుమారు రెండు మూడు వందల బంగారం దుకాణాలు ఉండగా, ధరలు పెరగడం, GST భారం వ్యాపారాలను దెబ్బతీస్తోంది.