ఆర్మూర్ పట్టణంలో శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ట్రాన్స్కో ఏడీ కృష్ణ తెలిపారు. 33 కేవి నూతన లైన్ పనుల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని, విద్యుత్ వినియోగదారులు, వ్యవసాయదారులు సహకరించాలని ఆయన కోరారు.