ఆర్మూర్ పట్టణంలో 33వ వార్డులో సోమవారం రోజు ఓటరు జాబితా ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా కొనసాగుతోందని, ఓటర్లు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని 33వ వార్డు కౌన్సిలర్ రాణి సుమన్ తెలిపారు.
33వ వార్డులో జరుగుతున్న ఓటరు జాబితా సవరణ ప్రక్రియను ఆమె స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) నిర్వహిస్తున్న విధులను పరిశీలించి, ఉన్నతాధికారులు జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు.