భీమ్ గల్ పట్టణంలో ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షం కురిసింది. ఇటీవల కోతకు వచ్చిన పంటలు, రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ అకాల వర్షం వల్ల పంట నాణ్యత తగ్గి, అమ్మకాలపై ప్రభావం పడే అవకాశం ఉందని, ప్రభుత్వం నష్టాలను అంచనా వేసి పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.