బాల్కొండ మండలం బస్సాపూర్ శివారులో రాత్రిపూట నిబంధనలకు విరుద్ధంగా మొరం తరలిస్తున్న రెండు టిప్పర్లను ఎస్సై శైలేంద్ర ఆధ్వర్యంలో అధికారులు సీజ్ చేశారు. జాతీయ రహదారికి మొరం తరలించడానికి అనుమతులు ఉన్నప్పటికీ, రాత్రిపూట తరలిస్తున్నట్లు గుర్తించి ఈ చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.